ఘనంగా ఎస్జీ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:37 PM
పీలేరులో ని సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 45వ వార్షికోత్స వం గురువారం ఘనంగా నిర్వహించారు.
పీలేరు, ఏప్రిల్ 25: పీలేరులో ని సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 45వ వార్షికోత్స వం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా ఎస్వీ యూనివర్సిటీ వీసీ వి.శ్రీకాంత రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని ఆకళింపు చేసు కుని అందులోని పాఠ్యాంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ రెడ్డి నివేదికను వీసీకి నివేదించారు. కార్యక్రమంలో మదనపల్లె బీటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆనంద్ రెడ్డి, మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.కృష్ణవేణి, వాల్మీకిపురం ఎనటీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, కలికిరి మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అంజలీ దేవి, పుంగనూరు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్, ఎస్జీ కళాశాల స్టూడెంట్స్ యూనియన ఉపాధ్యక్షులు శివరామిరెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.