Share News

‘జనసేనతోనే కోడూరు అభివృద్ధి’

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:18 PM

జనసేన గెలుపు కోడూరు అభివృది ్ధకి మలుపు నినాదంతో కూటమి నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు.

‘జనసేనతోనే కోడూరు అభివృద్ధి’
ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ నాయకులు

రైల్వేకోడూరు(రూరల్‌) ఏప్రిల్‌ 24: జనసేన గెలుపు కోడూరు అభివృది ్ధకి మలుపు నినాదంతో కూటమి నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. బాబు సూపర్‌ సిక్స్‌ డోర్‌ టు డోర్‌ ఎన్నిక ల ప్రచారంలో భాగంగా పట్టణం లోని నరసారంపేట, వెంకటేశ్వర పురం, న్యూ క్రృష్ణానగర్‌, పాత కృష్ణ, వినాయక నగర్‌, జగడంపల్లిలో జనసేన అభ్యర్ధి అరవ శ్రీధర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పఽథకాలను వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన అభ్యర్ధిని గెలి పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ నార్జల హేమరాజ్‌, టీడీపీ పట్టణ కన్వీనర్‌ పొకల మణి, మైనారిటీ నాయకులు పట్టాన మౌలా, మస్తాన, మహిళ నాయకురాలు మెహతాజ్‌, పోతురాజు సుమన పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:18 PM