Share News

వైసీపీని చిత్తుగా ఓడించేందుకు యువత సిద్ధం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:20 PM

ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు యువత సిద్ధంగా ఉన్నారని టీడీపీ యువనేత వల్లూరి కిరణ్‌ అన్నారు.

వైసీపీని చిత్తుగా ఓడించేందుకు యువత సిద్ధం

వైసీపీని చిత్తుగా ఓడించేందుకు యువత సిద్ధం

టీడీపీ యువనేత వల్లూరి కిరణ్‌

విద్యాధరపురం, ఏప్రిల్‌ 25: ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు యువత సిద్ధంగా ఉన్నారని టీడీపీ యువనేత వల్లూరి కిరణ్‌ అన్నారు. గురువారం నగరంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక నిరాశ నిస్పృహలలో కూరుకుపోయారన్నారు. వైసీపీ ఎంపీలు ప్రధాని కాళ్లకు మొక్కడం తప్ప ఏనాడైనా పార్లమెంట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నించారా అని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించకపోగా రాష్ట్రాన్ని గంజాయి, హెరాయిన్‌, డ్రగ్స్‌, నాసిరకం మద్యంకు నిలయంగా మార్చి యువతను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించేందుకు యువత సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 11:20 PM