Share News

వెల్దుర్తిలో ఆగిన ‘వందే భారత్‌’

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:39 PM

హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న వందే భారత్‌ రైలు గురువారం వెల్దుర్తి రైల్వేస్టేషన్‌లో సుమారు 15 నిమిషాల పాటు నిలిచింది. అదేసమయంలో (వందే భారత్‌ రైలు వస్తుందని) నంద్యాల నుంచి కర్నూలు వెళ్తున్న డెమోను ముందస్తుగా రైల్వేస్టేషన్‌లో అరగంట సేపు నిలిపా రు.

వెల్దుర్తిలో ఆగిన ‘వందే భారత్‌’

వెల్దుర్తి, ఏప్రిల్‌, 25: హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న వందే భారత్‌ రైలు గురువారం వెల్దుర్తి రైల్వేస్టేషన్‌లో సుమారు 15 నిమిషాల పాటు నిలిచింది. అదేసమయంలో (వందే భారత్‌ రైలు వస్తుందని) నంద్యాల నుంచి కర్నూలు వెళ్తున్న డెమోను ముందస్తుగా రైల్వేస్టేషన్‌లో అరగంట సేపు నిలిపా రు. గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఏపీఆర్‌ఎస్‌ పరీక్షలకు కర్నూలుకు సమ యానికి చేరుకోలేమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపం కారణంగా వందే భారత్‌ రైలు ఆగినట్లు రైల్వే వర్గాల సమాచారం.

Updated Date - Apr 25 , 2024 | 11:40 PM