రేపు నందికొట్కూరుకు చంద్రబాబు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:13 AM
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 29వ తేదీన నందికొట్కూరు పట్టణానికి రానున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.
నందికొట్కూరు, ఏప్రిల్ 27: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 29వ తేదీన నందికొట్కూరు పట్టణానికి రానున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం అల్లూరు గ్రామ సమీపంలో హెలిప్యాడ్ స్థలాన్ని మాండ్ర శివానందరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు హెలికాప్టర్లో అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారని, అక్కడి నుంచి నందికొట్కూరు అల్లూరు సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా పటేల్ సెంటర్ వరకు రోడ్డు షో, పటేల్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. అనంతరం అల్లూరు గ్రామం వద్ద బస చేస్తారన్నారు. 30వ తేదీ ఉదయం అక్కడి నుంచి బయలుదేరతారని ఆయన తెలిపారు. హెలిప్యాడ్ ప్రదేశాన్ని పరిశీలించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య, నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్రెడ్డి ఉన్నారు.