Share News

జగన్‌ మాటలు సంస్కారహీనం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:21 AM

సొంత చెల్లెలు వైఎస్‌ షర్మిలను పట్టుకుని సీఎం జగన్‌ సంస్కారహీనంగా మాట్లాడడం మహిళలందరినీ అవమానించడ మేనని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.

జగన్‌ మాటలు సంస్కారహీనం

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

డోన్‌, ఏప్రిల్‌ 27: సొంత చెల్లెలు వైఎస్‌ షర్మిలను పట్టుకుని సీఎం జగన్‌ సంస్కారహీనంగా మాట్లాడడం మహిళలందరినీ అవమానించడ మేనని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. శనివారం పట్టణంలో సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి ఆధ్వర్యంలో వంద రజక కుటుంబాలు కోట్ల సుజాతమ్మ సమక్షంలో టీడీపీలో చేరాయి. అదే విధంగా మండలంలోని సీసంగుంతల, మల్యాల, చిన్నమల్కాపురం గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్నమల్కాపురం గ్రామంలో వైసీపీ నాయకులు బింగి సోమన్న యాదవ్‌, మోకి మద్దయ్య, బింగి శివ, మహేష్‌, సోమ శేఖర్‌, సుధాకర్‌తో పాటు మరో 30 కుటుంబాలు కోట్ల సుజాతమ్మ సమక్షంలో అర్జున్‌ రెడ్డి, రేగటి రామ్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ వైఎస్‌ షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబు వారసురాలుగా టీటీపీకి మద్దతు తెలు పుతుందని బాధ్యత గల ముఖ్యమంత్రి చెల్లెలినే అవమానించడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, మా జీ ఎంపీపీ శేషఫణిగౌడు, జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, తిమ్మయ్య యాదవ్‌, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, భాస్కర్‌ నాయుడు, ధర్మవరం భరత్‌ రెడ్డి, రంజిత్‌ కిరణ్‌, వలసల బాలుడు, చిన్న తిమ్మయ్య యాదవ్‌, మురళీగౌడు, సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:21 AM