Share News

జేఈఈ తేజం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:43 PM

జేఈఈ-మెయిన్స్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కర్నూలు నగరానికి చెందిన కోడూరు తేజేశ్వర్‌ సత్తా చాటాడు.

జేఈఈ తేజం

మెయిన్స్‌లో రాణించిన కర్నూలువాసి

ఆలిండియా స్థాయిలో 83వ ర్యాంక్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 25: జేఈఈ-మెయిన్స్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కర్నూలు నగరానికి చెందిన కోడూరు తేజేశ్వర్‌ సత్తా చాటాడు. ఆలిండియా స్థాయిలో ఓపెన్‌ కేటగిరిలో 83వ ర్యాంకు సాధించాడు. తేజేశ్వర్‌ తల్లిదండ్రులు కోడూరు శేఖర్‌, భార్య కృష్ణవేణి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కర్నూలులో నివాసం ఉంటున్నారు. ఎస్‌.తేజేశ్వర్‌ విజయవాడలో ఎస్‌ఐఐటీ-జేఈఈ ఫిట్జ్‌లో ఇంటర్‌ చదువుతున్నారు. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ-మెయిన్స్‌ ఫలితాల్లో 99.9981 పర్సంటైల్‌ సాధించి ఆలిండియా స్థాయిలో 83వ ర్యాంకు సాధించాడు. జేఈఈ- అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో మంచిర్యాంకు సాధించి దేశంలో ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థల్లో చేరడమే లక్ష్యమని తేజేశ్వర్‌ వివరించాడు.

Updated Date - Apr 25 , 2024 | 11:43 PM