నందవరం ఆలయ హుండీ లెక్కింపు
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:32 PM
నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు భక్తుల సమక్షంలో ఆలయ ఈవో కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.
బనగానపల్లెరూరల్, ఏప్రిల్ 25: నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు భక్తుల సమక్షంలో ఆలయ ఈవో కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. రూ.17,73,769 నగదు, 14 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి ఆదాయం లభించినట్లు తెలిపారు. అన్నదాయం హుండీ ఆదాయం రూ.60,937 ఆదాయం లభిం చినట్లు తెలిపారు. పర్యవేక్షణ అధికారి పీ. హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.