Share News

వైసీపీని ప్రజలు క్షమించరు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:38 PM

ఐదేళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీని ప్రజలు క్షమించరని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.

వైసీపీని ప్రజలు క్షమించరు

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

డోన్‌, ఏప్రిల్‌ 25: ఐదేళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీని ప్రజలు క్షమించరని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. గురువారం మండలంలోని కామగానిగుంట్ల, సోంపురం గ్రామా ల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు పెంచమని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్గి గత ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి విజయ భట్టు, శ్రీనివాసులు యాదవ్‌, కమలాపురం సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి, రంజిత్‌ కిరణ్‌, గోవిందరెడ్డి, బాలు, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:38 PM