‘నెలాఖరులోగా జొన్న కొనుగోలు’
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:09 AM
జిల్లాలో జొన్న కొనుగోలు రిజిష్ట్రేషన్లకు ఈ నెల చివరి వరకు అవకాశం ఉందని మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్బాబు తెలిపారు.
వెలుగోడు, మార్చి 27: జిల్లాలో జొన్న కొనుగోలు రిజిష్ట్రేషన్లకు ఈ నెల చివరి వరకు అవకాశం ఉందని మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్బాబు తెలిపారు. బుధవారం మండలంలోని రేగడగడూరులో పంట నిల్వలను ఆయన పరిశీలించారు. జిల్లాలో సాగు చేసిన 19 మండలాల్లో జొన్న కొనుగోలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికి 983 మంది రైతులకు చెందిన 6500 మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేశామన్నారు. డీఎం నాగరాజు, ఏడీ ఆంజనేయులు, ఏవో పవన్కుమార్ పాల్గొన్నారు.