వైసీపీని ఇంటికి పంపండి
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:30 PM
రాష్ట్రంలో ఐదేళ్లుగా రాక్షస పాలన సాగిస్తున్న వైసీపీని ఇంటికి సాగనంపాలని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.
డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
బేతంచెర్ల, ఏప్రిల్ 25: రాష్ట్రంలో ఐదేళ్లుగా రాక్షస పాలన సాగిస్తున్న వైసీపీని ఇంటికి సాగనంపాలని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో టీడీపీ మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య, పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ముందుగా మద్దిలేటి స్వామి ఆలయ ముఖద్వారం ముందు ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. రంగాపురం పురవీధుల గుండా ఇంటింటికి ప్రచారం నిర్వహి స్తూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన, దౌర్జన్యాలు, ఇసుక దందా, మద్యం మాఫియా వంటి అరాచకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డార న్నారు. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర అవస్థ లు పడుతున్నారని అన్నారు. రైతుల ఖాతాల్లో పైసా కూడా జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.