Share News

‘టీడీపీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు’

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:45 PM

వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందని, మళ్లీ తెలుగుదేశం పార్టీతోనే భవిష్యత్తు ఉంటుందని నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అన్నారు.

‘టీడీపీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు’
గోస్పాడులో పర్యటిస్తున్న శబరి, ఫరూక్‌ తదితరులు

గోస్పాడు, ఏప్రిల్‌ 25: వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందని, మళ్లీ తెలుగుదేశం పార్టీతోనే భవిష్యత్తు ఉంటుందని నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అన్నారు. గురువారం గోస్పాడులో ఇంటింటి ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్‌ సిక్స్‌ పథకాలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు, బీసీలకు 50 సంవత్సరాలకే రూ.4 వేల పింఛన్‌, రాజధాని అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, వైసీపీ ప్రభుత్వానికి ఓటమి ఖరారైందని అన్నారు. ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీకి ఓటు వేయాలని అన్నారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి, వీర సింహారెడ్డి, శీలం భాస్కర్‌రెడ్డి, పల్లె విశ్వనాథ్‌రెడ్డి, జిన్ను శ్రీనివాసరెడ్డి, భూమా హుసేని, శ్రీనివాసయాదవ్‌, పెద్ద హుసేని, జూపల్లె రామగోపాల్‌రెడ్డి, ఎస్‌ ఓబుల్‌రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:45 PM