రైళ్లలో తనిఖీలు.. సొత్తు స్వాధీనం
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:41 PM
ఎన్నికల సందర్భంగా ఒంగోలు స్టేషన్లో పలు రైళ్లల్లో తనిఖీలు చేయగా రూ.5 లక్షల విలువైన వెండి ప్లేట్లు, 13 మద్యం ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే సీఐ ఎన్.శ్రీకాంత్బాబు చెప్పారు.
రూ.5 లక్షల విలువైన వెండి ప్లేట్లు, 13 మద్యం బాటిళ్లు సీజ్
ఒంగోలు(క్రైం), ఏప్రిల్ 25 : ఎన్నికల సందర్భంగా ఒంగోలు స్టేషన్లో పలు రైళ్లల్లో తనిఖీలు చేయగా రూ.5 లక్షల విలువైన వెండి ప్లేట్లు, 13 మద్యం ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే సీఐ ఎన్.శ్రీకాంత్బాబు చెప్పారు. గురువారం స్థానిక రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు తనీఖీలు నిర్వహించారు. నెల్లూరు వైపు వెళుతున్న ప్యాసింజర్ రైలులో తెనాలికి చెందిన సీహెచ్ రామకృష్ణ, విజయలక్ష్మీల వద్ద 9.530 కిలోల కలిగిన 27 వెండి ప్లేట్లు ఉన్నాయి. ఈ మేరకు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా చెన్నై నుంచి రిటైర్డ్ సీఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ 13 ఫుల్ బాటిళ్లు మద్యం తీసుకొస్తుండగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి సీఆర్పీఎఫ్ అధికారులకు నివేదించామన్నారు.