సైకతం.. చైతన్యం
ABN , Publish Date - Apr 28 , 2024 | 01:12 AM
ఓటు ఎంతో ప్రాధాన్యమైనదంటూ తీర్చిదిద్దిన సైకత శిల్పం అందరినీ ఆలోచింపజేసింది.
ఓటు హక్కుపై తీరంలో ప్రజలకు అవగాహన
కొత్తపట్నం (ఒంగోలు నగరం), ఏప్రిల్ 27 : ఓటు ఎంతో ప్రాధాన్యమైనదంటూ తీర్చిదిద్దిన సైకత శిల్పం అందరినీ ఆలోచింపజేసింది. శనివారం కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో ఓటర్ల అవగాహన సదస్సులో భాగంగా బీచ్లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం, సెల్ఫీ పాయింట్, మత్స్యకారుల బోట్లతో ఏర్పాటు చేసిన స్వీప్ ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్కుమార్ ఓటుహక్కును అందరూ వినియోగించుకునే విధంగా ప్రతిజ్ఞ చేయించారు. సైకత శిల్పం వద్ద బెలూన్లు ఎగురవేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శౌర్యమన్, స్వీప్ జిల్లా నోడల్ ఆఫీసర్ బి.రవి, ఒంగోలు ఆర్డీవో జి.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
-------------------------------