గంజాయి అమ్మకాల్లో రాష్ట్రం ప్రథమ స్థానం
ABN , Publish Date - Apr 28 , 2024 | 01:58 AM
: రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం కంటే గంజాయి అమ్మించడంలోనే దేశంలో ప్రథమ స్థానంలో ఉంచిన ఘనత జగన్రెడ్డిదేనని ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ ఎస్ఎండీ షరీఫ్ అన్నారు.
ఎర్రగొండపాలెం, ఏప్రిల్ 27 : రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం కంటే గంజాయి అమ్మించడంలోనే దేశంలో ప్రథమ స్థానంలో ఉంచిన ఘనత జగన్రెడ్డిదేనని ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ ఎస్ఎండీ షరీఫ్ అన్నారు. ఎర్రగొండపాలెం షాధీఖానా భవనంలో శని వారం నియోజకవర్గ ముస్లిం మైనార్టీలు, నూరుబాషా సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కి 149 సీట్లు వచ్చి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు టీడీపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో న్యాయవాదులను నియమించి పోరాడారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాలలో న్యాయవాదులను ఏర్పాటు చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు కలిశారన్నారు. కూటమి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఆయన పాలనలో ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి సంక్షేమంతో పాటు రక్ష ఉంటుందన్నారు. రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడని ముస్లింలకు రాయితీపై రుణాలు, మౌజన్లకు జీతాలు, ముస్లింల ఆస్థులకు రక్షణ ఉంటుందన్నారు. ఏపీలో చంద్రబాబు ముస్లింలు ఒక కన్ను, హిందువులు ఒక కన్ను అని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలపై అనేక దాడులు జరిగాయన్నారు. ముస్లింలలో పేదరికం ఎక్కువగా ఉందని, అది పోవాలంటే మే 13 పోలింగ్ రోజు లు ముస్లింలు అందరు టీడీపీ ఓట్లు వేయాలని అన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలో అబ్ధుల్ సలాం అప్పులు కట్టలేక ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందితే ముస్లింలలో ఉన్న క్యాబినెట్ మంత్రి అంజాద్ భాష ఖండించిన సందర్భం లేదని అన్నారు. అనంతపురంలో వైసీపీ నాయకుడి కుమార్తె కంటే ముస్లిం విద్యార్థినికి మార్కులు ఎక్కువగా వచ్చాయని టీసీ ఇచ్చి పంపారని, దీంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. నరసరావుపేటలో మసీద్కువెళ్లి వస్తున్న ముస్లింను వైసీపీ గూండాలు హత్య చేశారన్నారు. ఎమ్మిగనూరులో తల్లిదండ్రులకు అన్నం తీసుకొని వెళ్లిన చిన్నారని కొట్టి ఆత్యాచారం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో దుల్హాన్ పథకంలో ముస్లిం బాలికకు రూ.50 వేలు నగదు చంద్రబాబు తీసుకొచ్చార న్నారు. టీడీపీ ప్రభుత్వంలో దుల్హాన్ పథకంలో వేల మంది బాలికలకు పెండ్లి కానుక ఇచ్చామ ని అన్నారు. వైసీపీ ఐదేళ్లలో 3వేల మందికి ఇచ్చారని అన్నారు. రాజధాని బిల్లు విషయంలో శాసన మండలిలో అనేక ప్రలోభాలు పెట్టి రాజదాని లేకుండా చేయాలని దర్మార్గపు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మంచి సౌమ్యుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, గూడూరి ఎరిక్షన్బాబుకు ఎమ్మెల్యే అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలన్నారు. టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్బాబు మాట్లాడుతూ.., నియోజకవర్గంలో ముస్లింలలో పేదరికం లేకుండా సంక్షేమ పథకాలు అమలుజే స్తామన్నారు. కార్యక్రమానికి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ అద్యక్షత వహించారు. కార్యక్రమంలో జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర, రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎండీ యూసఫ్, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ మాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గపూర్, పట్టణ అధ్యక్షులు మస్తాన్వలి, షేక్ వలి, షేక్ రఫీ, స్థానిక ముస్లిం, నూరుబాషా సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.