టీడీపీలో చేరిన గిరిజన కుటుంబాలు
ABN , Publish Date - Apr 27 , 2024 | 01:41 AM
మం డలంలోని గంజివారిపల్లె పంచాయటీలోని గాంధీనగర్, శాంతినగర్ గిరిజనగూడెంలో, చెన్నరాయునిపల్లె గ్రామంలో వైసీపీ పార్టీని వీడి మొత్తం 40 కు టుంబాలు టీడీపీలో చేరాయి.
ఎర్రగొండపాలెం, ఏప్రిల్ 26 : మం డలంలోని గంజివారిపల్లె పంచాయటీలోని గాంధీనగర్, శాంతినగర్ గిరిజనగూడెంలో 25 కుటుంబాలు, కొలుకుల పంచాయతీలోని చెన్నరాయునిపల్లె గ్రామంలో 15 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి మొత్తం 40 కు టుంబాలు టీడీపీలో చేరాయి. వీరు ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయానికి శుక్రవారం రాగా వీరందరికి టీడీపీ కండువాలు వేసి టీడీపీ అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్బాబు టీడీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైసీపీపై నమ్మకం పోయి టీడీపీలోకి వస్తున్నారన్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తానని ఎరిక్షన్బాబు అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీపై పేద ప్రజలకు నమ్మకం పోయిందని అందరు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారని అన్నారు. గిరిజనులు మాట్లాడుతూ 5 ఐదేళ్లుగా గిరిజనగూడేలలో ఉపాధి పనులు కూడ సక్రమంగా కల్పించలేదన్నారు. తమ గిరిజన గూడెంలలో పక్కాగృహాలు నిర్మించలేదని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే గిరిజన గూడెంలు అభివృద్ది చెందుతాయని గిరిజనులు అన్నారు. ఎస్టీ సెల్ నాయకులు చెవుల అంజయ్య పాల్గొన్నారు.