Share News

నేడు పీసీసీ చీఫ్‌ షర్మిల రాక

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:08 AM

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆదివారం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

నేడు పీసీసీ చీఫ్‌ షర్మిల రాక

విశాఖపట్నం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి):

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆదివారం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు అక్కయ్యపాలెంలోని మహారాణి పార్లర్‌ జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పి.సత్యారెడ్డి కోరారు.

Updated Date - Apr 28 , 2024 | 09:08 AM