నేడు పాడేరు, అరకులోయలో షర్మిల రోడ్షో
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:56 AM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల శనివారం పాడేరు, అరకులోయ కేంద్రాల్లో రోడ్షో నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి రాజమండ్రిలో బస చేసిన ఆమె శనివారం ఉదయం పాయకరావుపేటలో రోడ్షో ముగించుకుని సాయంత్రం 4 గంటలకు పాడేరు చేరుకుంటారు.
- అరకులోయలోనే రాత్రి బస
పాడేరు, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల శనివారం పాడేరు, అరకులోయ కేంద్రాల్లో రోడ్షో నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి రాజమండ్రిలో బస చేసిన ఆమె శనివారం ఉదయం పాయకరావుపేటలో రోడ్షో ముగించుకుని సాయంత్రం 4 గంటలకు పాడేరు చేరుకుంటారు. ఇక్కడ రోడ్షో అనంతరం రాత్రి 7 గంటలకు అరకులోయ చేరుకుని అక్కడ రోడ్షో నిర్వహిస్తారు. కార్యక్రమం అనంతరం ఆమె అరకులోయలోనే రాత్రి బస చేసి ఆదివారం ఉదయం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో రోడ్ షోకు హాజరవుతారు. షర్మిల రోడ్షోను విజయవంతం చేసేందుకు పాడేరు, అరకులోయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సతకా బుల్లిబాబు, శెట్టి గంగాధరస్వామి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పాచిపెంట శాంతకుమారి, తదితరులు ఏర్పాట్లు చేస్తున్నారు.