Share News

వచ్చేది కూటమి ప్రభుత్వమే: సంధ్యారాణి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:18 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రోడ్లు వేయిస్తానని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు.

వచ్చేది కూటమి ప్రభుత్వమే: సంధ్యారాణి

పాచిపెంట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రోడ్లు వేయిస్తానని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. శనివారం కర్రివలసలో టీడీపీ మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఉపాధి పనుల వద్దకు వెళ్లి వేతనదారులతో మాట్లాడారు. తమ గ్రామానికి రోడ్డు లేదని వేతనదారులు వాపోయారు. ప్రతి గ్రామానికి రోడ్డుతో పాటు ఆ గ్రామంలోగల అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సాలూరు రూరల్‌: తాను గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానని కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆమె కూర్మరాజుపేట, పుణికిలవలస, చిన్నవలస గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, సర్పంచ్‌ నళిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:18 AM