పాలకొండలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:58 PM
పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది.
పాలకొండ: పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అరుణాచల ట్రావెల్స్ యజమాని కడగల పురుషోత్తం, పరిశెర్ల సీతంనా యుడు, ఎచ్చెర్ల లక్ష్మీలకు చెందిన ట్రాన్స్పోర్టు అండ్ ట్రావెల్కు సంబంధించిన పూరిపాకల షాపులు మూడు అగ్నికి ఆహుతయ్యాయి. షాపులకు ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పక్షి వాలడం వల్ల నిప్పు రవ్వలు ఈ షాపులపై పడి అగ్ని ప్రమాదం చోటుచేసు కుంది. షాపులో ఉన్న ఆయిల్స్, ఫర్నీచర్, టైర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అదుపు చేశారు. కాగా, రూ.2.50 లక్షలు ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేసినట్టు తెలిసింది.