సైకో పాలనకు స్వస్తి పలకాలి: జగదీశ్వరి
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:31 PM
రాష్ట్రంలోని సైకో పాలనకు స్వస్తి పలకాలని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి పిలపునిచ్చారు.
గరుగుబిల్లి: రాష్ట్రంలోని సైకో పాలనకు స్వస్తి పలకాలని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి పిలపునిచ్చారు. ఉల్లిభద్ర సమీపంలోగల ఎర్రన్నగుడి ప్రాంతంలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు అంబటి తవిటినాయుడు, ముదిలిబాబు విజయవాంకుశం, యామల శ్రీనివాసరావు, ఆర్.గోవిందరావుతో పాటు పలు గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కురుపాం: కురుపాంలో కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి ప్రచారానికి అపూర్వ ఆదరణ లభించింది. గురువారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో ఆమె కురుపాం పంచాయతీలోని పూతికవలస, సీతంపేట, పాత కురుపాం, శివ్వన్నపేట గ్రామాల్లో ప్రచారం చేశారు. ఆమెకు గ్రామస్థులు హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు కడ్రక మల్లేష్, తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్కుమార్, టీడీపీ మండల కన్వీనర్ కేవీ కొండయ్య, బీజేపీ నాయకుడు ఎన్.దూళికేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.