Share News

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి: జగదీశ్వరి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:15 AM

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ అన్నారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి: జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ అన్నారు. మండలంలోని దుడ్డిగల్‌, బాలేసు గ్రామాల్లో శనివారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిఒక్కరూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి, తనను గెలిపించాలని జగదీశ్వరి కోరారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి బిడ్డిక పద్మావతి, జనసే నాయకులు కడ్రక మల్లేష్‌, బీజేపీ నాయకులు ఉమామహేశ్వరి కోలా రంజిత్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక

కురుపాం: కురుపాం పంచాయతీ చెరువుకొమ్మవలస 14వ వార్డు మెంబర్‌ కందుల బాలకృష్ణ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ చేరాయి. వీరంతా శనివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్‌, టీడీపీ మండ ల కన్వీనర్‌ కేవీ కొండయ్య, మాజీ ఎంపీపీ జీవీ రమణమూర్తి, కర్రి శ్రీనివాసరావు, మంతిని త్రిపురనాథ్‌, టీడీపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:15 AM