పాపం.. పున్నారావు
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:33 PM
విజయనగరం జిల్లా రాజాంకు చెందిన సిరిపురపు పున్నారావు చిన్నపాటి తప్పిదం వల్ల నామినేషన్ వేయలేకపోయారు.
రాజాం రూరల్, ఏప్రిల్ 25: విజయనగరం జిల్లా రాజాంకు చెందిన సిరిపురపు పున్నారావు చిన్నపాటి తప్పిదం వల్ల నామినేషన్ వేయలేకపోయారు. ఈ ఘటన రాజాంలో గురువారం చోటుచేసుకుంది. నామినేషన్ వేసేందుకు అవసరమైన అన్నిపత్రాలున్నా.. తాజాగా ప్రారంభించిన బ్యాంకు ఖాతాకు సంబంధించిన పాస్పుస్తకం లేకపోవడంతో నామినేషన్ వేయలేని పరిస్థితి పున్నారావుకు ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్న కొత్తకోటకు చెందిన సిరిపురపు పున్నారావు రాజాం నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసేందుకు నిర్ణయించుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని పత్రాలను సిద్ధం చేశారు. గురువారం మధ్యాహ్నం నామినేషన్ వేసేందుకు తన మద్దతుదారులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలు ఆందజేశారు. పత్రాలు పరిశీలించిన ఆర్వో.. తాజాగా ప్రారంభించిన బ్యాంకు పాస్పుస్తకం లేకపోవడాన్ని గుర్తించారు. అప్పటికే సమయం మూడు గంటలు కావస్తుండడంతో ఏమీచేయని పరిస్థితుల్లో పున్నారావు వెనుదిరిగారు. పున్నారావు మళ్లీ నామినేషన్ వేయాలంటే మరో అయిదేఽళ్లు ఆగాల్సిందే.