Share News

కూటమి విజయానికి వలసలే నిదర్శనం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:36 PM

రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనడానికి పార్టీలోకి రోజురోజుకు వస్తున్న వలసలే నిదర్శనమని ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి తెలిపారు.

కూటమి విజయానికి వలసలే నిదర్శనం
ఏలూరు 50వ డివిజన్‌లో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బడేటి చంటి

ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి

ఏలూరుటూటౌన్‌, ఏప్రిల్‌ 25: రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనడానికి పార్టీలోకి రోజురోజుకు వస్తున్న వలసలే నిదర్శనమని ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. స్థానిక ఐదో డివిజన్‌లో ‘ బాబును మళ్ళీ రప్పింద్దాం’ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయన్నారు. ఎన్నికల సమరభేరీ మోగినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి వస్తూనే ఉన్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని విధానాలు నచ్చక వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. 50వ డివిజన్‌ నుంచి మాజీ కౌన్సిలర్‌ చింతా దుర్గారెడ్డి ఆధ్వర్యంలో చింతా మహేష్‌, జగ్గి శ్రీనివాస్‌, కప్పా శ్రీనివాసరావులతో పాటు సుమారు వంద మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికి పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. తనను నమ్మి పార్టీలోకి వచ్చిన వారందరికి భవిష్యత్తుల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి రుణం తీర్చుకునేందుకు టీడీపీలోకి నిస్వార్థంగా ప్రజలు వస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం ఖయమైందన్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ అమరావతి అశోక్‌, పర్సా ప్రసాద్‌, కంపా విటల్‌, రెడ్డి ఈశ్వరరావు, గంగాధరరావు, పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:36 PM