యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,129 కోట్లు
ABN , Publish Date - Apr 25 , 2024 | 05:34 AM
ఈ ఏడాది మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ రూ.7129.67 కోట్ల లాభం ఆర్జించింది...
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ రూ.7129.67 కోట్ల లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ.5,728.42 కోట్ల నష్టం నమోదు చేసింది. బ్యాంక్ త్రైమాసికాదాయం రూ.28,758 కోట్ల నుంచి రూ.35,990 కోట్లకు పెరిగింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1 డివిడెండ్ను సిఫారసు చేసింది.