Share News

DD News: కాషాయం రంగులోకి మారిన డీడీ న్యూస్

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:13 PM

కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే డీడీ న్యూస్(DD News) కొత్త రూపం సంతరించుకుంది. డీడీ అని ఎరుపు రంగు లోగోను.. కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయించింది. తమ సోషల్ మీడియా పేజీలు సైతం కొత్త రూపాన్ని సంతరించుకున్నాయని డీడీ న్యూస్ ఓ ప్రకటనలో తెలిపింది.

DD News: కాషాయం రంగులోకి మారిన డీడీ న్యూస్

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే డీడీ న్యూస్(DD News) కొత్త రూపం సంతరించుకుంది. డీడీ అని ఎరుపు రంగు లోగోను.. కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయించింది. తమ సోషల్ మీడియా పేజీలు సైతం కొత్త రూపాన్ని సంతరించుకున్నాయని డీడీ న్యూస్ ఓ ప్రకటనలో తెలిపింది.

''మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. సరికొత్త DD వార్తలను మీ ముందుకు తెస్తాం. మాకు ధైర్యం ఉంది. వేగంపై కచ్చితత్వం, ఆరోపణలపై వాస్తవాలు, సంచలన నిజాలు ప్రజల ముందుకు తెస్తాం'' అని డీడీ న్యూస్ ఓ పోస్ట్‌లో వెల్లడించింది.


దూరదర్శన్ చరిత్ర

దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. 1965లో దూరదర్శన్ న్యూ ఢిల్లీ వార్తలను ప్రసారం చేసింది. 1975 నాటికి డీడీ సేవలను ముంబై, అమృత్‌సర్ సహా ఏడు నగరాలకు విస్తరించింది. 1976 ఏప్రిల్ 1న ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక విభాగం కిందకు వచ్చింది.

1982లో దూరదర్శన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ అయింది. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దూరదర్శన్ కలర్ వెర్షన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీలో 1982 ఆసియా క్రీడలు కలర్ టెలికాస్ట్ జరిగింది. ప్రస్తుతం దూరదర్శన్ 6 జాతీయ ఛానెల్‌లు, 17 ప్రాంతీయ ఛానెల్‌లను కలిగి ఉంది.

జాతీయ ఛానెల్‌లలో DD నేషనల్, ఇండియా, కిసాన్, స్పోర్ట్స్, ఉర్దూ, భారతి ఉన్నాయి. మరోవైపు DD అరుణ్‌ప్రభ, బంగ్లా, బీహార్, చందన, గిర్నార్, మధ్యప్రదేశ్, మలయాళం, నార్త్ ఈస్ట్, ఒడియా, పొధిగై, పంజాబీ, రాజస్థాన్, సహ్యగిరి, సప్తగిరి, ఉత్తర ప్రదేశ్, యాదగిరి, కాశీర్ అనే ప్రాంతీయ ఛానల్‌లను కలిగి ఉంది.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 05:15 PM