Lok Sabha Polls2024: ప్రశాంతంగా లోక్సభ తొలి దశ పోలింగ్.. పోలింగ్ శాతం ఎంతంటే?
ABN , Publish Date - Apr 19 , 2024 | 05:54 PM
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్సభ పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్సభ పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 60 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం తెలిపింది.