Ram Mandir: అయోధ్యలో కనులపండువగా బాల రాముని ప్రాణ ప్రతిష్ట

ABN, Publish Date - Jan 22 , 2024 | 01:42 PM

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరాముడికి సమర్పించడానికి పట్టు వస్త్రాలను తీసుకుని రామాలయానికి వచ్చారు. ప్రధాని రాకతో అయోధ్యలో సందడి వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 12:29 గంటల సమయంలో జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated at - Jan 22 , 2024 | 01:51 PM