కళ్లన్నీ ఆ ఇద్దరి పైనే!
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:11 AM
సొంతగడ్డపై మరోసారి పరుగుల సునామీని సృష్టించేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సిద్ధమవుతున్నారు. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తో తలపడేందుకు...
విరాట్, హెడ్ కట్టడికి వ్యూహాలు
ఫేవరెట్ సన్రైజర్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సొంతగడ్డపై మరోసారి పరుగుల సునామీని సృష్టించేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సిద్ధమవుతున్నారు. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తో తలపడేందుకు కమిన్స్ సేన తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. కొద్ది రోజుల కిందట ఆర్సీబీను వారి హోంగ్రౌండ్లో ఓడించిన ఎస్ఆర్హెచ్, అదే ఊపుతో మరోసారి ఆధిపత్యం చెలాయించాలని తహతహలాడుతోంది. హెడ్, క్లాసెన్, మార్క్రమ్, అభిషేక్, సమద్, నితీశ్ రెడ్డితో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. డుప్లెసి నాయకత్వంలోని ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ విరాట్, గ్రీన్, రజత్, దినేశ్ కార్తీక్తో బాగానే ఉన్నా, పేలవమైన బౌలింగ్ యూనిట్ వల్ల వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్లో ఉన్న విరాట్ కోహ్లీ, భీకర ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్పైనే అందరి దృష్టి నెలకొంది. విరాట్ ఉప్పల్లో ఆడిన 7 ఐపీఎల్ మ్యాచ్ల్లో 139.73 స్ట్రయిక్ రేట్తో 313 పరుగులు చేశాడు.