సెహ్వాగ్ లెవెన్లో.. పాండ్యాకు దక్కని చోటు!
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:05 AM
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన టీ20 వరల్డ్కప్ జట్టును ప్రకటించాడు. అయితే, ఇందులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కక పోవడం ఆశ్చర్యం కలిగించింది...
న్యూఢిల్లీ: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన టీ20 వరల్డ్కప్ జట్టును ప్రకటించాడు. అయితే, ఇందులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కక పోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐపీఎల్ కామెంట్రీ సందర్భంగా.. సెహ్వాగ్ అయితే ఎవరికి జట్టులో చోటు కల్పిస్తాడని సహచర వ్యాఖ్యాతలు గిల్ క్రిస్ట్, మైకేల్ వాన్ అడిగారు. దీంతో ‘జైస్వాల్, రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, రింకూ లేదా దూబే, బుమ్రా, సిరాజ్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, జడేజా’ అంటూ తన జట్టును చెప్పుకొచ్చాడు. వీరిలో పాండ్యా లేకపోవడంతో వారు అవాక్కయ్యారు. అయితే, హాస్య చతురత కలిగిన సెహ్వాగ్.. 15 మందిలో పాండ్యా ఉంటాడని నవ్వులు పూయించాడు.