పాండ్యాపై కీలక నిర్ణయం!
ABN , Publish Date - Apr 17 , 2024 | 01:53 AM
టీ20 వరల్డ్క్పలో పాల్గొనే భారత జట్టు ఎంపికపై సెలెక్టర్లు సమాలోచనలు ఆరంభించినట్టు సమాచారం. ఇటీవలే బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో...
రోహిత్, ద్రవిడ్, అగార్కర్ భేటీ
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్క్పలో పాల్గొనే భారత జట్టు ఎంపికపై సెలెక్టర్లు సమాలోచనలు ఆరంభించినట్టు సమాచారం. ఇటీవలే బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ రాహుల్ ద్రవిడ్లతో రోహిత్ శర్మ సమావేశమైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో కీలక నిర్ణయం తీసుకొన్నారట. ఐపీఎల్లో ఎలా బౌలింగ్ చేస్తాడనే దానిపైనే పాండ్యాకు జట్టులో చోటు కల్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పాండ్యా.. ఆడిన ఆరు మ్యాచ్ల్లో 11 ఓవర్లు వేసి మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.