థ్యాంక్ గాడ్..బతికిపోయా!
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:08 AM
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ దూకుడుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ జట్టు నమ్మశక్యంగాని రీతిలో ఆడుతోందని చెప్పాడు...
కరాచీ: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ దూకుడుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ జట్టు నమ్మశక్యంగాని రీతిలో ఆడుతోందని చెప్పాడు. ‘ముందుగా నేనీ తరంలో క్రికెట్ ఆడనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 20 ఓవర్లలో 270 పరుగులు సాధించడమా? వన్డేల్లో అయితే ఇది 450-500తో సమానం. ఒకసారి కాకుండా ఇప్పటికి 3-4 సార్లు ఇలాగే బాదేశారు. మరీ 5 ఓవర్లలో వంద పరుగులు చేయడమైతే అన్యాయం. ఎంత ఫుల్టా్సలో బంతులు వేసినా ఇన్ని రన్స్ సాధించడం కష్టం. పాపం ఈ ఫార్మాట్లో బౌలర్లను చూస్తేనే జాలేస్తోంది’ అని వసీం చెప్పుకొచ్చాడు.