Share News

బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ అండ

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:20 AM

పేదలు, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ అండ
నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కుంభం

వలిగొండ, ఏప్రిల్‌ 19: పేదలు, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని గొల్నెపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఆగస్టు నెలలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఏప్రిల్‌ 21న భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. లక్షల కోట్లు అప్పు చేసి నాణ్యతలేని ప్రాజెక్టులు నిర్మించి ప్రజా ధనాన్ని దుర్వి నియోగం చేశారన్నారు. లిక్కర్‌ స్కాములో కవిత పాత్ర ఉండడం, మాజీ మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి ఇతరుల మాటలు వినడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్‌ గూడూరు శివశాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మం గళవారం వెంకట్‌రెడ్డి, నాయకులు యాదయ్య, మల్లేశం, గూడూరు శ్రీధర్‌రెడ్డి, ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్‌రాజు, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, నాయకులు గరిసె రవి, బోళ్ల శ్రీనివాస్‌, చిలుగూరి సత్తిరెడ్డి, బత్తిని లింగయ్య, దైవాదీనం, సతీష్‌, వెంకన్న, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:21 AM