ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:31 AM
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ కోరారు.
కోల్సిటీ, ఏప్రిల్ 19: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ కోరారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆర్ఎఫ్సీఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వీప్ అవగాహన సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా నిజాయితీగా ఓటు వేయాలని, మతం, వర్గం, కులం, జాతి, భాష వంటి ప్రలోభాలకు లోనుకావద్దని, విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఓటు వేసే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి రవుఫ్ఖాన్, ఇండస్ర్టీ జనరల్ మేనేజర్ మధుసూధనాచారి పాల్గొన్నారు.