Share News

పార్లమెంట్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:16 AM

సజావుగా పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహ ణ జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అధికారు లను ఆదేశిం చారు.

పార్లమెంట్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌

- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

జగిత్యాల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): సజావుగా పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహ ణ జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అధికారు లను ఆదేశిం చారు. బుధవారం హైద్రాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, సంబందిత శాఖల అధికారులతో ఎన్నికలపై నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జగిత్యాల పట్టణం లోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, అదనపు కలెక్టర్లు రవి బాబు, దివాకర హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధా న ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ అర్హులైన ఓటర్లకు ఇంటి వద్ద ఓటింగ్‌ నిర్వహణకు అవసరమైన బృందాలను సన్నద్ధం చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓటర్‌ ఫెసిలిటేషన్‌ ఏర్పా టు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు సలహాలు, సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ రఘువరన్‌, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ లక్ష్మీనారాయణ, డీఆర్‌డీఓ సంపత్‌ రావు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్ధార్లు, స్వీప్‌ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:16 AM