ఒక్క అవకాశమివ్వండి అభివృద్ధి చేస్తా
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:31 PM
పార్లమెంట్ ఎన్నికల్లో తమ కు అవకాశమిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూ పిస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కు మార్ అన్నారు.
- బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
కోడేరు, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల్లో తమ కు అవకాశమిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూ పిస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కు మార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స న్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోతుగంటి రాము లును అత్యధిక మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలన్నారు. మాజీ ఎమ్మె ల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అ భ్యర్థి ప్రవీణ్కుమార్ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నిరుద్యోగులకు, యువ కులకు ఉపాధి కల్పిస్తారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రఘువర్ధన్రెడ్డి, అభిలాష్రావు తదితరులు పాల్గొన్నారు.