Share News

35 నామినేసన్ల తిరస్కరణ

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:02 AM

నల్లగొండ, భువనగిరి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నల్లగొండ పార్లమెంట్‌ నియెజకవర్గ పరిఽఽధిలో మొత్తం 25 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అఽఽధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన వివిధ కారణాలతో తిరస్కరించారు.

35 నామినేసన్ల తిరస్కరణ

రెండు పార్లమెంట్‌ స్థానాలకు స్ర్కూట్నీ పూర్తి

ఈ నెల 29 ఉపసంహరణకు చివరి గడువు

యాదాద్రి, నల్లగొండ టౌన్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): నల్లగొండ, భువనగిరి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నల్లగొండ పార్లమెంట్‌ నియెజకవర్గ పరిఽఽధిలో మొత్తం 25 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అఽఽధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన వివిధ కారణాలతో తిరస్కరించారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 10మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హనుమంతు కే.జెండగే తిరస్కరించారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి నల్లగొండ పార్లమెంట్‌ నియెజకవర్గానికి వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 56మంది 114 మంది సెట్లు దాఖలు చేశారు. కాగా నామినేషన్ల పరిశీలన అనంతరం 25 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, చివరగా 31 మంది అభ్యర్థులు నిలిచారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో మొత్తం 61మంది నామినేషన్లు దాఖలు చేయగా, 10మంది నామినేషన్లు తిరస్కరించడంతో మొత్తం 51మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 29 కాగా, ఈ నెల 27వ తేదీ నాలుగో శనివారం కావడం, 28వ తేదీ ఆదివారం కావడంతో నామినేషన్లు ఆయా తేదీల్లో ఉపసంహరణకు దరఖాస్తులు స్వీకరించబోమని ఎన్నికల అధికారులు, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు దాసరి హరిచందన, హనుమంతు కే.జెండగే తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 12:02 AM