9న భువనగిరికి హోంమంత్రి అమిత్షా
ABN , Publish Date - May 07 , 2024 | 12:03 AM
కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్షా ఈ నెల 9న భువనగిరికి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా స్థానిక రా యిగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు.
భువనగిరి టౌ న్, మే 6: కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్షా ఈ నెల 9న భువనగిరికి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా స్థానిక రా యిగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. ఈ మేరకు పట్టణ శివారులోని స్పీన్నింగ్ మిల్లో హెలీప్యాడ్ను బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, గూడూరు నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భువనగిరితో పాటు కేంద్రంలో బీజేపీ గెలవనున్నదన్నారు. అమిత్షా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్గుప్తా, పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, కే.సతీష్ పాల్గొన్నారు.