బీసీవై కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణుల దాడి..

ABN, Publish Date - Apr 26 , 2024 | 12:00 PM

చిత్తూరు జిల్లా: మాగాండ్లపల్లిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. భారత చైతన్య యువజన పార్టీకి చెందిన ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయ్య యాదవ్ గ్రామంలో రోడ్ షో నిర్వహించారు.

చిత్తూరు జిల్లా: మాగాండ్లపల్లిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. భారత చైతన్య యువజన పార్టీకి చెందిన ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయ్య యాదవ్ గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో కాన్వాయ్ వెనుక పార్టీ నాయకులు మేనిఫోస్టో కరపత్రాలను పంపిణీ చేస్తుండగా స్థానిక వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. కాన్వాయ్‌పై రాళ్లను విసిరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 26 , 2024 | 12:00 PM