సమాజ శ్రేయస్సు కోసం కృషిచేద్దాం
ABN, First Publish Date - 2022-06-26T19:51:07+05:30
సమాజ శ్రేయస్సు కోసం కృషిచేద్దాం
జస్టిస్ డా.ఏఆర్ సెల్వకుమార్
ప్యారీస్, జూన్ 25: ఆరోగ్యవంతమైన సమాజం కోసం సమష్టిగా కృషిచేయాలని తమిళనాడు హ్యూమన్ రైట్స్ కమిషన్ మాజీ సభ్యులు జస్టిస్ డా.ఏఆర్ సెల్వకుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా నంగనల్లూర్లో శనివారం ఒకరోజు ప్రత్యేక వేసవి శిక్షణా శిబిరం నిర్వహించారు. సోషియల్ జస్టిస్ పీస్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మిక, సంగీతం, సాహిత్యం, మానవ హక్కుల పరిరక్షణ విభాగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ‘ఫీస్ట్ ఆఫ్ ఈక్వాలిటీ’ జాతీయ అవార్డు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డా.ఎ.జోసఫ్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు డా.అమల్ పోర్వరాణి నేతృత్వంలో సాగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా జస్టిస్ ఏఆర్ సెల్వకుమార్ హాజరయ్యారు. తెలుగు ప్రముఖులు, సంగీత రంగంలో విశిష్టసేవలందిస్తున్న ప్రముఖ సువార్త గాయకుడు, సంగీత దర్శకుడు ఎల్.టోనిప్రకాష్, సియోన్ ఔట్రీచ్ మినిస్ట్రీస్ ప్రధాన కార్యదర్శి పడుచూరి ఇశ్రాయేలుకు ‘ఫీస్ట్ ఆఫ్ ఈక్వాలిటీ’ అవార్డులు, ప్రకాశం జిల్లా వెలిగండ్ల పంచాయతీ సర్పంచ్ తాతపూడి సురే్షకు ‘మధర్ థెరిస్సా సేవా అవార్డు’ అందజేసి వారి సేవలు ప్రశంసించారు.
Updated Date - 2022-06-26T19:51:07+05:30 IST