Home » Telangana » Khammam
ఖమ్మం లోక్సభ టికెట్ పంచాయతీ బెంగుళూరు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు.
Telangana: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్, సీసీటెక్నీషియన్, మరో ఘటనలో ఎల్ఆర్ఎస్(LRS) కోసం లంచం(Bribe) తీసుకుంటూ టౌన్ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. భద్రాచలంలో(Bhadrachalam) ఈనెల 12న పాత మార్కెట్ గోడౌన్లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ..
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరుకానున్నారు.
Bhadrachalam Ram Navami LIVE: భద్రాచల క్షేత్రంలో(Bhadrachalam) మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కళ్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కళ్యాణం(Seetharamula Kalyanam)! శీరామ నవమి(Ram Navaami 2024) సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ఉండటంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం వెళ్లడం..
భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా బుధవారం భద్రాచల క్షేత్రం రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. రామయ్య కళ్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరుగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో రెండవ రోజు బుధవారం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మండల లేఖ, కుండ, కలశ, యాగశాల అలంకరణ జరగనుంది. సాయంత్రం సార్వభౌమ వాహన సేవ జరుగుతుంది.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని.. ఆ పరిస్థితుల్లో నీటిని మొత్తం వేస్ట్గా దిగువ ప్రాంతాలకు వదిలారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నీటి కొరత ఏర్పడిందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ (BRS) కు లోక్సభ ఎన్నికల ముందు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలంతా వరుసగా కాంగ్రెస్ (Congress) లో చేరుతున్న సమయంలో గులాబీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే కోవలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కూడా గులాబీ పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది.
Telangana: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ నీలిమేఘశ్యాముడు ఈరోజు (సోమవారం) పెళ్లి కొడుకు అవనున్నాడు. కళ్యాణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో డోలోత్సవం, అనంతరం వసంతోత్సవం నిర్వహించనున్నారు. ముత్తైదువులు ఈరోజు పసుపు కొట్టి పనులు ప్రారంభించి కళ్యాణ తలంబ్రాలు కలుపనున్నారు. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగనుంది.