Home » Andhra Pradesh » Krishna
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని గత వాదనల సందర్బంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు.
వైఎస్ జగన్ ఐదేళ్ల పాల నలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని పోలవరం ద్రోహిగా ఆయన మిగిలిపోయారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో విమ ర్శించారు.
బీఎస్పీ జగ్గయ్యపేట నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు కొదమల ప్రభుదాస్ చెప్పారు.
రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేద్దామని, రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి విజయాన్ని చేకూర్చాలని కూటమి పెడన అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు.
మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తానని, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మైనార్టీల సమస్యలు పరిష్కరిస్తామని కూటమిని అధికారంలోకి తేవాలని ముస్లింలకు కూటమి మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
నియోజకవర్గంలోని నాగాయలంక, కోడూరు మం డలాల్లో నివశిస్తున్న యానాదుల సంక్షేమం కోసం నాబార్డు ద్వారా ఆర్థిక సహకా రం అందించేందుకు కృషి చేసిన ఎంపీ బాలశౌరికి యానాది మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా విజయబాబు కృతజ్ఞతలు ఒక ప్రకటనలో తెలిపారు.
పెడన నియోజకవర్గ హెల్ప్లైన్ డెస్క్ను తహసీల్దార్ కార్యాల యంలో సోమవారం పెడన నియోజకవర్గ ఎన్నికల అధికారి పి.వెంకటరమణ ప్రారంభించారు.
కృష్ణాజిల్లాలోని వివిధ రేషన్ షాపుల నుంచి అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న 258 టన్నుల బియ్యాన్ని సోమవారం వేలం వేస్తే ఆశించినంత ధరకు వ్యాపారులు పాడలేదు.
దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఉద్యోగుల చేతివాటం తగ్గడం లేదు. గతంలోనూ పలుమార్లు దర్శన టికెట్ల రీసైక్లింగ్ విషయంలో ఉద్యోగులను తప్పించిన వైనం తెలిసిందే. తాజాగా ఈవో తనిఖీల్లో దర్శన టికెట్లు రీసైకిలింగ్ చేసినట్టు గుర్తించారు.
ప్రజా సమస్యలపై నిత్యం గొంతెంతే ఎర్రజెండాల పార్టీల ప్రతినిధులను చట్టసభలకు పంపించాలని సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సితార ప్రాంతంలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల సీసీఐ సమితుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.