Home » Accident
హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనల్లో వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు పలువురు గతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు ప్రజాదరణ పొందిన నాయకులూ మృతిచెందారు. ఫిలిప్పీన్స్ ఏడో అధ్యక్షుడిగా పనిచేస్తూ, అవినీతిపై ఉక్కుపాదం మోపిన రమోన్ మెగసెసే నుంచి ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వంటి వారు ఉన్నారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు, ఈదురుగాలులతో తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని పర్వతాల మధ్య ఉన్న డిజ్మార్ అటవీ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే.
ఛత్తీస్గఢ్ లోని కవార్థా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తాపడి 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ రాజ్యాంగంలో గల ఆర్టికల్ 131 ప్రకారం అధ్యక్షుడు ఆకస్మాత్తుగా చనిపోతే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగ అధిపతితో కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. కౌన్సిల్ ప్రతిపాదన మేరకు ఉపాధ్యక్షుడు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఖమేని ఆమోదం లభిస్తే వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారు. అలా తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. పొరుగుదేశం అజర్బైజాన్, ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఓ డ్యామ్ ప్రారంభోత్సవానికి ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమిర్ అబ్దులాహియన్, అధికారులు, అంగరక్షకులతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరారు.
అనేక మంది రోడ్డుపై బైక్(bike) నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల(mistakes) వల్ల తరుచుగా ప్రమాదాలు(accidents) జరుగుతున్నాయి. అలా జరిగే ప్రమాదం పలు మార్లు పెద్దది కాగా, మరికొన్ని సార్లు చిన్న యాక్సిడెంట్తో తప్పిపోతుంది. అయితే బైకర్లు డ్రైవింగ్ చేసే క్రమంలో చిన్న తప్పులు చేయకుండా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఇప్పుడు చుద్దాం.
పోర్షే లగ్జరీ కారు(Porsche car)లో వేగంగా వస్తున్న వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి ఓ బైక్ను బలంగా ఢీకొట్టాడు(accident). దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పది రోజుల్లో పెళ్లి. కుటుంబంలో సందడి మొదలైంది. పెళ్లి బట్టలు కొనేందుకు అందరూ కలిసి రెండు కార్లలో హైదరాబాదుకు వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. స్వస్థలానికి మరో గంటలో చేరుకోవాల్సి ఉండగా.. ఒక కారు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పెళ్లికొడుకు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో 44వ జాతీయ ...
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు.
రెండు గంటల ముందు వరకూ అమ్మమ్మ, తాతయ్యకు కబుర్లు చెబుతూ ఆడుకుంది ఆ పాప..! ఆ బుజ్జిబుజ్జి మాటలకు మురిసిపోతూ మెల్లిగా మనవరాలితో కలిసి నిద్రలోకి జారుకున్నారు ఆ పెద్దవాళ్లు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం