Home » Adilabad
ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి సమయాల్లో పంట నష్టానికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఫసల్ భీమా పథకం మళ్లీ తెరపైకి వస్తోంది. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పంట బీమా పథకంపై విధివిఽధానాలు రూపొందించాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురిసి నప్పుడు రైతులు నష్టపోతున్నారు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ హామీ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15 లోగా పంట రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో 2 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ కింద లబ్ధి చేకూరనుంది.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జోగాపూర్, చిత్తాపూర్ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు.
విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు సకాలంలో అందించాలని ఎంపీడీవో గంగ మోహన్ సూచించారు. శుక్రవారం ఐకేపీ కార్యాల యంలో టైలరింగ్ సెంటర్ ప్రారంభించి వారితో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం మంచిర్యాల జిల్లా కోకన్వీనర్ బాలసాని శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం జన్నారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో స్ధానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేష న్లు కల్పిస్తామని ప్రకటించిందన్నారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. జూన్ 4న ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకు లతో కలిసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ముగి సిన అనంతరం ధాన్యానికి క్వింటాళుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా మనడం రైతాంగాన్ని మోసం చేయడమేనన్నారు.
ఆర్ఎంపీ, పీఎంపీల చికిత్స కేంద్రాలపై స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహిస్తూ వేధింపులకు గురి చేయడం సరైంది కాదని తెలంగాణ అనుభవ వైద్యుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి గాదాసు శంకరయ్య, సంయుక్త కార్యదర్శి రవీందర్లు పేర్కొన్నారు.
జిల్లాలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, డెంగ్యూ నివారణ మా బాధ్యత- సురక్షితమైన రేపటి కోసం అనే నినాదంతో జిల్లా వ్యా ప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ బదా వత్ సంతోష్ అన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి ఆర్డీవో రాములు, డీఆర్డీవో కిషన్, జిల్లా పౌరసరపరాల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.