Home » AIMIM
హైదరాబాద్ మినహా మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆ పార్టీ శ్రేణులకు సష్టమైన సంకేతమిచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధ్రువీకరించారు. ప్రచారం గడువు ముగియడానికి ముందు.. శనివారం మధ్యాహ్నం ఖిల్వత్ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.
ఒవైసీ సోదరులను ఉద్దేశించి అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘15 సెకన్లు కాదు. నేను మోదీకి చెబుతున్నా.. నవనీత్ కౌర్కు గంట సమయం ఇవ్వండి.
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెచ్చగొట్టే సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీజేపీ నాయకురాలు నవనీత్కౌర్ ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రచార జోరు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. ముస్లింలపై ప్రధాని మోదీ చేసిన కామెంట్లను ఎంఐఎం(AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు.
బీజేపీ (BJP) దెబ్బకు పాత బస్తీలో బద్ధ శత్రువులు ఏకమయ్యారా!? ఇక్కడ ఎంఐఎంకు ఎంబీటీ పరోక్ష మద్దతు ఇస్తోందా!? మజ్లిస్కు (AIMIM)సహకరించడానికే పోటీ నుంచి తప్పుకుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి తాజా పరిణామాలు..
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్కు మరో 17రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17లోక్సభ స్థానాలు ఉన్నప్పటికీ.. అందరి గురి కేవలం 16 స్థానాలే.. ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు.. ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అదే హైదరాబాద్ నియోజకవర్గం. ఓవైసీ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం హైదరాబాద్. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా.. ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు.