Home » Amit Shah
Telangana: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బీబీ పాటిల్ అన్నారు. కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో వీరు పాల్గొని ప్రసంగించారు. నల్గొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవని అన్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఐదో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
‘ప్లాన్-బీ’.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. లోక్సభ ఎన్నికలు ముగిశాక వచ్చే ఫలితాలను బట్టి.. బీజేపీ ‘ప్లాన్-బీ’ అమలు చేయొచ్చనే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా..
ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టాస్తారని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో 400 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయంలో తామేమీ ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏది న్యాయసమ్మతమని భావించామో దానిని మేం మా తీర్పులో స్పష్టం చేశాం’ అని తెలిపింది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఒకవైపు అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లతో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పీవోకేని తిరిగి భారత్లో కలుపుతామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని సిరాంపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. 370 అధికరణం రద్దు తర్వాతే జమ్ము కశ్మీర్లో శాంతి పవనాలు వీస్తున్నాయని, స్వేచ్ఛా నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపారు.
కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలా మంది.. కేజ్రీవాల్కు (కోర్టు) స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నమ్ముతున్నారు’’ అని ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం.. 75 ఏళ్ల వయసు రాగానే.. అంటే 2025లో మోదీ రిటైర్ అవుతారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపైనా అమిత్ షా స్పందించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్షా 'ఏఎన్ఐ' వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఇది రొటీన్ జడ్జిమెంట్ కాదని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్పై భారతదేశం సార్వభౌమాధికారాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. పీఓకే ఇండియాకు చెందినదని, దానిని వెనక్కి తెచ్చుకుంటామని అన్నారు. పశ్చిమబెంగాల్లోని సెరంపోర్లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో విపక్షాల తీరును ఆయన ఎండగట్టారు.
లోక్సభ ఎన్నికల్లో మోదీ ఇప్పటికే 270 సీట్లు గెలిచినట్టు తాను చెప్పగలనని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. 400కు పైగా సీట్లలో గెలుపు సాధించడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో తాము పోరాడుతున్నామని పశ్చిమబెంగాల్లోని బాంగావ్లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ చెప్పారు.