Home » Anam Venkata Ramana Reddy
హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న ప్యాలెస్, మాల్ను ఎన్నికల అఫిడవిట్లో సీఎం జగన్ రెడ్డి ( CM Jagan) ఎందుకు చూపించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్లా ఆస్తులా.. ? అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
మహిళలపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదికను ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా డీజీపీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.
ఏపీ సీఎం జగన్పై రాయితో దాడి జరగడంపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు గుర్తించారనే ప్రచారం జరగుుతున్నా.. అధికారికంగా పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. నిందితులను గుర్తించేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జగన్పై దాడి చేసిన వారి ఆచూకీ తెలియజేస్తే రూ.2లక్షలు పారితోషికం ఇస్తామంటూ విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ చేసిన ప్రకటనపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు.
నెల్లూరు: ఏపీ తీరప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు పడ్డాయని.. గేట్ వే ఆఫ్ జగన్గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.