Home » Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికలు -2024 పోలింగ్ ముగిసింది. చాలా ప్రాంతాల్లో వైసీపీ మూకలు హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో ఓటింగ్ 67.99 శాతం పోలింగ్ నమోదయింది.
Lok Sabha Election 2024 Live Updates in Telugu: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. నాలుగో విడతలో భాగంగా నేడు నాడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో గల అరకు, రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికాతో పాటు పలు దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, ఎన్నారై టీడీపీ నేతలు ఏపీకి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు (YSRCP Leaders) రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల వద్ద రెచ్చిపోతున్నారు. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ..
Andhrapradesh: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లో ఓటర్పై వైసీపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటనపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపిక్ మిశ్రా స్పందించారు. ఓటర్పై చేయి చేసుకోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఐతా నగర్ పోలింగ్ బూత్ వద్దనున్న పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఐతా నగర్లో ఓటరను ఎమ్మెల్యే కొట్టిన ఘటనకు చెందిన సీసీ ఫుటేజ్ను తెప్పించాలని దీపక్ మిశ్రా ఆదేశించారు.
పల్నాడులో హింస పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల లో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని టీడీపీ చెబుతోంది. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా... శాంతి భద్రతలు కాపాడలేకపోయారని చంద్రబాబు విమర్శించారు
ఏపీలో పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు అదే జోరు నడుస్తోంది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్పై ప్రభావమైతే కనిపించడం లేదు.
Andhrapradesh: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్లో బయలుదేరారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల( (ap elections 2024)) సమరం హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈసారి అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గం(anantapur Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది బరిలో ఉన్నారు, ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉందనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.