Home » AP Govt
సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు (AP Elections).. ఎన్నికల తర్వాత జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దాడులు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి..
రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కోరారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.
రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులను జగన్ సర్కారు ఎప్పటికప్పుడు నిండా ముంచేస్తోంది. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
Andhrapradesh: ఏపీలో యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదని విమర్శించారు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలన్నారు.
Andhrapradesh: ఈసీ నిర్ణయాన్ని అపహస్యం చేసే విధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలపై ఈసీ నిన్న (గురువారం) స్పష్టంగా ఆర్డర్ ఇచ్చిందని.. జగన్ ఆరు స్కీమ్స్కు బటన్ నొక్కితే డబ్బులు పడలేదన్నారు. లబ్ధిదారులకు డబ్బులు లేవని.. సాక్షికి మాత్రం ప్రకటనలు ఇస్తారని మండిపడ్డారు.
Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండి లేఖ రాసింది. నిధుల విడుదలలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ సీఎస్కు లేఖ రాసింది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డీబీటీ పథకాల అమలవుతున్నాయా? అని ప్రశ్నించింది. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు పథకాలకు నిధులు ఇవ్వలేని ప్రభుత్వం పరిస్థితి ఒక్కసారిగా ఎలా మారిందని..
Andhrapradesh: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి జగన్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర సర్కార్కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని ఉన్నతన్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది.