Home » AP News
పోలింగ్కు మరికొన్ని గంటల సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్సీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలకు ప్లాన్ చేసినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉండవల్లిలో రేపు ఉదయం 7.00 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఓటు వేయనున్నారు.
Andhrapradesh: ఓటు వేసేందుకు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్లో నిరీక్షిస్తున్నారు. అయితే రద్దీకి సరిపడా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయని పరిస్థితి. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది.
Andhrapradesh: ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ వైసీపీ తీవ్రస్థాయిలో యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో డబ్బులు, నగదును రహస్యంగా పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే డబ్బుల విషయంలో పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగుతున్నారు. కొంతమందికి ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో తెరపడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రచారానికి తెరబడగా.. ప్రలోభాలకు తెర లేపారు రాజకీయ పార్టీలు. నగదు, మద్యం, చీరల పంపిణీ, రకరకాల వస్తువులను పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Andhrapradesh: పోలింగ్లో అత్యంత ముఖ్యమైనది సిరా గుర్తు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసిన అనంతరం పోలింగ్ సిబ్బంది సిరా గుర్తు వేస్తారు. ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఈ సిరా ఎంతో ముఖ్యం. సదరు ఓటరు ఓటు వేసినట్లు తెలిసేందుకు, అలాగే ఆ ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు పోలింగ్ సిబ్బంది సిరా గుర్తును వేస్తుంటారు. అయితే చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందంటూ ఇటీవల ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటింగ్ డేను నగరవాసి హాలీడేగా భావిస్తున్నాడు. పోలింగ్ బూత్ మొహమే చూడని వారి కోసం పలు సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. ట్రావెల్ మొదలు ఆస్పత్రుల వరకూ, హోటల్స్ మొదలు అమ్యూజ్మెంట్ పార్క్ల వరకూ పలు సంస్థలు ఆఫర్లు అందిస్తున్నాయి. పోలింగ్కు ఒక్క రోజే ఉండటంతో మరికొన్ని సంస్థలు చివరి నిమిషంలో..
Andhrapradesh: ఎన్నికలకు, సంక్షేమ పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పిస్తూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా.. వేల సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లతో వైసీపీ మరో పన్నాగానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి టెలికాన్ఫరెన్స్ చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను తీసుకురావాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలంటూ కోరారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ అరాచకం ఒకటి వెలుగు చూసింది. నందిగామ మండలం కంచలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ చెబుతోంది. గ్రామంలో టీడీపీకి అనుకూలంగా ఉందని వైసీపీ మూకలు దాడికి దిగాయి.
‘మా వీధిలో బోరు వేయించండి. గుడి నిర్మాణానికి సా యం చేయండి. మాకు రోడ్డు వేయించండి’ ఒకప్పుడు ఓట్లు అడగడానికెళ్లే అభ్యర్థులకు ఇలాంటి డిమాండ్లు ఎదురయ్యేవి. కానీ గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ట్రెండ్ మారింది.